charan: 'రంగస్థలం' మహిమ .. 'వినయ విధేయ రామ' కేరళ హక్కుల కోసం పోటీ!

  • చరణ్ హీరోగా బోయపాటి సినిమా 
  • కేరళలోను భారీ విడుదల 
  • కేరళలో పెరుగుతోన్న చరణ్ మార్కెట్

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా కేరళ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారని తెలుస్తోంది. వివిఆర్ డిస్ట్రిబ్యూటర్స్ .. ప్రకాశ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా కొనుగోలు చేశారని సమాచారం. ఈ హక్కుల కోసం వాళ్లు భారీ మొత్తం చెల్లించారనే టాక్ వినిపిస్తోంది.

చరణ్ ఇంతకు ముందు చేసిన 'రంగస్థలం' సినిమా మలయాళంలోను విడుదలై విజయాన్ని సాధించింది. అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగానే 'వినయ విధేయ రామ' కేరళ హక్కులు భారీ రేటు పలికినట్టుగా చెబుతున్నారు. అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారని అంటున్నారు. బన్నీ మాదిరిగానే మలయాళంలో చరణ్ మార్కెట్ కూడా పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు.   

More Telugu News