dhanunjaya: ప్లీజ్ ఓట్ ఫర్ 'భైరవగీత': రామ్ గోపాల్ వర్మ

  • యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ గా 'భైరవగీత'
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఈ నెల 30
  • డిసెంబర్ 7వ తేదీకి వాయిదా      

జయాపజయాలను గురించి రాంగోపాల్ వర్మ పెద్దగా పట్టించుకోడు. తనకి నచ్చిన కంటెంట్ ను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూనే ఉంటాడు. అలా ఈ సారి ఆయన 'భైరవగీత'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. వర్మ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సిద్ధార్థ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకు ముందే వర్మ చెప్పాడు.

ఈ నెల 29వ తేదీన '2.ఓ' వస్తున్నా వెనక్కి తగ్గేదిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే సెన్సార్ కి సంబంధించిన కొన్ని విషయాల కారణంగా ఆలస్యమవుతోందనీ, అందువలన ఈ సినిమాను ఎన్నికల రోజైన డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నామని చెప్పాడు. ప్లీజ్ ఓట్ ఫర్ ..'భైరవగీత' అంటూ తాజాగా వర్మ ట్వీట్ చేశాడు. కన్నడ నటుడు ధనుంజయ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన ఇరా మోర్ కథానాయికగా కనిపించనుంది.         

More Telugu News