dhanush: 'మారి 2'తో రంగంలోకి దిగుతోన్న ధనుశ్

  • ధనుశ్ హీరోగా 'మారి 2'
  • కథానాయికగా సాయిపల్లవి 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు     

ధనుశ్ హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన 'మారి' మంచి విజయాన్ని సాధించింది. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో అదే దర్శకుడితో ఈ సినిమాకి సీక్వెల్ గా 'మారి 2' రూపొందింది. ఈ సినిమాలో ధనుశ్ జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ధనుశ్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ధనుశ్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమైంది. 'మారి'ని మించిన విజయం 'మారి 2'కి దక్కుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.    

More Telugu News