charan: చరణ్ సొంత బ్యానర్లో అఖిల్ సినిమా!

  • వెంకీ అట్లూరి నుంచి 'మిస్టర్ మజ్ను'
  • అఖిల్ 4వ  సినిమాపై ఆసక్తి 
  • దర్శకుడిగా తెరపైకి బోయపాటి పేరు   

'తొలిప్రేమ'తో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ ను సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. కథాపరంగా ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ విదేశాల్లో జరిగింది. సంక్రాంతికి గానీ .. ఆ తరువాత గాని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ 4వ సినిమా ఏ బ్యానర్లో .. ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది.

అఖిల్ 4వ సినిమాకి బోయపాటి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, ఈ సినిమా చరణ్ సొంత బ్యానర్లో రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలోనే చరణ్ 'వినయ విధేయ రామ' చేస్తున్నాడు. ఈ సినిమా సెట్లోనే బోయపాటి .. చరణ్ కలిసి అఖిల్ ప్రాజెక్టును సెట్ చేశారని చెప్పుకుంటున్నారు. తన బ్యానర్లో ఇతర హీరోల సినిమాలను కూడా నిర్మిస్తానని ఆరంభంలోనే చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే.    

More Telugu News