gajwel: గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం

  • ఒంటిమామిడి పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో బయటపడిన డబ్బు
  • ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న హనుమంతు అనే వ్యక్తి వద్ద నగదు
  • ఇతను వంటేరుకు అనుచరుడని సమాచారం

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన గజ్వేల్‌ కు చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డికి షాక్‌ తగిలింది. పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, సదరు వ్యక్తి ప్రతాప్‌రెడ్డి ప్రధాన అనుచరుడని భావిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని ఒంటి మామిడి వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సులోని ప్రయాణికులను, వారి బ్యాగులను తనిఖీ చేయగా హనుమంతు అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో రూ.20 లక్షల నగదు గుర్తించారు. దీంతో హనుమంతుని పోలీసులు అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతను వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రధాన అనుచరుడని తెలుస్తోంది.

More Telugu News