తూర్పుగోదావరిలో గిరిజనులతో కలిసి చిందేసిన పవన్ కల్యాణ్.. వైరల్ గా మారిన వీడియో!
- తూర్పుగోదావరిలో పర్యటిస్తున్న జనసేనాని
- బస్సులో ఏజెన్సీ ప్రాంతానికి ప్రయాణం
- సంప్రదాయ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికిన గిరిజనులు
ఆ తర్వాత సుద్ధగొమ్ము గిరిజన ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం పలికారు. తమ ప్రాంతానికి వచ్చిన పవన్ కు గిరిజనులు సంప్రదాయ తలపాగాను బహూకరించారు. దీంతో ఈ తలపాగాను ధరించిన జనసేనాని.. సంప్రదాయ డోలును వాయించారు. అనంతరం గిరిజనులతో కలిసి చిందేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.