Road Accident: కారును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు యువకుల దుర్మరణం

  • శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో ప్రమాదం
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈరటోనిపల్లి గేటు వద్ద ఘటన
  • మృతుల వివరాలు తెలియాల్సి ఉంది

ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న ప్రణయ్‌ (20), మహేశ్‌ (22) అనే ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల మండలం ఈరటోనిపల్లి గేటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌ వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీరెవరు, ఎక్కడి వారన్న వివరాలు తెలియరాలేదని, ఘటనా స్థలి నుంచి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని ఉప్పునూతల పోలీసులు తెలిపారు.

More Telugu News