charan: చరణ్ మూవీ రిలీజ్ పై పుకార్లు .. స్పందించిన నిర్మాత

  • అనుకున్న ప్రకారం షూటింగ్ జరుగుతోంది 
  • ఎక్కడా ఆలస్యమనేదే లేదు 
  • చెప్పిన సమయానికే విడుదల

చరణ్ కథానాయకుడిగా యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ బోయపాటి శీను 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు దర్శక నిర్మాతలు చాలారోజుల క్రితమే చెప్పారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడమనేది సందేహమేననే ప్రచారం కొన్ని రోజులుగా ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. "ముందుగా అనుకున్న ప్రకారమే మా సినిమా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఏ విషయంలోను ఆలస్యమనేది జరగడం లేదు. ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండకపోవచ్చంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. సంక్రాంతికి మా సినిమా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు'' అంటూ పుకార్లకు తెరదింపేశారు.   

More Telugu News