rajani: 'పెట్టా' ఆడియో రిలీజ్ డేట్ ఖరారైపోయింది

  • వచ్చేనెల 3వ తేదీన ఫస్టు సాంగ్ 
  • 7వ తేదీన రెండవ పాట రిలీజ్ 
  • సంక్రాంతికి సినిమా విడుదల

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీని కార్తీక్ సుబ్బరాజ్ డిఫరెంట్ లుక్ తో చూపించనున్నారు. రజనీ సరసన కథానాయికగా సిమ్రాన్ నటిస్తుండగా, మరో కథానాయికగా త్రిష కనిపించనుంది. విజయ్ సేతుపతి .. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు పాటను రిలీజ్ చేయనున్నారు. ఆ తరువాత 7వ తేదీన రెండవ పాటను వదలనున్నారు. 9వ తేదీన పూర్తి పాటలతో ఆడియోను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చాలా తక్కువ గ్యాప్ లో రజనీ నుంచి రెండు సినిమాలు వస్తుండటంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.       

More Telugu News