sundeepkishan: ఆసక్తిని రేపుతోన్న 'నిను వీడని నీడను నేనే' ఫస్టులుక్

  • నిర్మాతగానూ సందీప్ కిషన్ 
  • దర్శకుడిగా కార్తిక్ రాజు పరిచయం 
  • బాలీవుడ్ నుంచి అన్య సింగ్    

సందీప్ కిషన్ 'వెంకటాద్రి టాకీస్' అనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ బ్యానర్ పై తనే హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. సూపర్ పవర్స్ కలిగిన హీరో చుట్టూ తిరిగే ఈ కథకి, 'నిను వీడని నీడను నేనే' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం ఫస్టులుక్ ను రిలీజ్ చేసింది.

టైటిల్ తో పాటు ఫస్టులుక్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్టు పోస్టర్ కి మంచి మార్కులు పడిపోయాయనే చెప్పాలి. ఇటీవలే బాలీవుడ్ కి పరిచయమైన 'అన్య సింగ్' ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, తనకి హీరోగానూ .. నిర్మాతగాను కూడా సక్సెస్ ను ఇస్తుందని సందీప్ కిషన్ భావిస్తున్నాడు.    

More Telugu News