sharwanand: శర్వానంద్ .. సాయిపల్లవి నుంచి రొమాంటిక్ సాంగ్

  • రొమాంటిక్ లవ్ స్టోరీతో హను రాఘవపూడి 
  • సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్ 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల     

శర్వానంద్ - సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' నిర్మితమైంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి, తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 'పద పద పదమని పెదవులిలా పరిగెడితే .. పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే .. తరుగుతోందే మదికాయాసం .. పెదవడుగుతోందే చెలి సావాసం ..' అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది.

మంచుకొండల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట చాలా అందంగా.. హృద్యంగా వుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం .. శోభి కొరియోగ్రఫీ .. జేకే ఫోటోగ్రఫీ ఈ పాటకి ప్రాణం పోశాయి. ఈ పాట యూత్ కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ప్రసాద్ - సుధాకర్ నిర్మించిన ఈ సినిమాలో, మురళీశర్మ .. సుహాసిని కీలకమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

More Telugu News