rajasekhar: ఎవరికీ ఏమీ కాలేదు.. అందరం క్షేమంగానే ఉన్నాం: రాజశేఖర్

  • కులూమనాలికి వెళ్తుండగా రోడ్డుపై విరిగిపడ్డ కొండచరియలు
  • అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపిన రాజశేఖర్
  • 10 రోజుల క్రితం అయిన గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడి

'కల్కి' సినిమా షూటింగ్ కోసం తన కుటుంబంతో పాటు సినిమా టీమ్ అంతా కులూమనాలికి వెళ్తున్నామని హీరో రాజశేఖర్ తెలిపారు. ఉన్నట్టుండి రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయని... దీంతో తమ ప్రయాణం కొంచెం ఆలస్యమయిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని, అందరం క్షేమంగానే ఉన్నామని తెలిపారు. తమ ప్రయాణం మళ్లీ మొదలైందని, అందమైన కులూమనాలిలో షూటింగ్ కోసం ఆత్రుతగా ఉన్నామని చెప్పారు. స్నేహితులు, అభిమానుల నుంచి ఎన్నో ఫోన్  కాల్స్ వస్తున్నాయని... అందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు 'కల్కి' షూటింగ్ సెట్లో 10 రోజుల క్రితం తాను గాయపడ్డానని రాజశేఖర్ తెలిపారు. ఓ స్టంట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అయినా తాను విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపారు. ఈ సీక్వెన్స్ లో ఇతర నటులు కూడా పాల్గొంటున్నారని... తాను విశ్రాంతి తీసుకుంటే వారి డేట్స్ కు సంబంధించిన ఇబ్బందులు వస్తాయని చెప్పారు. క్రమంగా తాను కోలుకుంటున్నానని... కులూమనాలికి వెళ్తున్నానని తెలిపారు. ట్విట్టర్ ద్వారా రాజశేఖర్ ఈమేరకు వెల్లడించారు.

More Telugu News