t-congress: వీహెచ్ కు తప్పిన ప్రమాదం.. ఊడిపోయిన ప్రచార రథం చక్రాలు

  • రాజన్న సిరిసిల్లలో ప్రచారం చేసి వస్తుండగా ప్రమాదం
  • నేరెళ్ల గ్రామం వద్ద సంఘటన
  • డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

ఎన్నికల ప్రచారంలో ఉన్న టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజన్న సిరిసిల్ల నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం వద్ద వీహెచ్ ఉన్న ప్రచార రథం రెండు చక్రాలు ఊడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

నా హత్యకు ఎవరో కుట్ర పన్నారు: వీహెచ్

ఈ ప్రమాద ఘటనపై వీహెచ్ స్పందిస్తూ, ప్రచార రథం బస్సు స్క్రూలు ఎవరో ఊడదీయడం వల్లే రెండు చక్రాలు ఊడిపోయాయని, తన హత్యకు ఎవరో కుట్ర పన్నారని వీహెచ్ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపే వరకు అక్కడే ఉంటానని అన్నారు.

More Telugu News