అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలుస్తాం: వైఎస్ జగన్

  • బాబు ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం
  • సీఎం చంద్రబాబు అమ్ముడుపోయారు
  • మోసగాళ్ల పక్షాన నిలబడ్డారు 
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలుస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బాబు ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం. బాధితుల పక్షాన నిలబడాల్సిన ముఖ్యమంత్రి కాసులకు అమ్ముడుపోయి మోసగాళ్ల పక్షాన నిలబడ్డారు’ అని తన పోస్ట్ లో ఆరోపించారు. 

Go Back to Shorts
agri gold
ys jagan
Chandrababu

More Telugu News