ఒవైసీ ఒక రాజకీయ వ్యభిచారి.. ఎవరు డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు: బీజేపీ నేత కృష్ణసాగర్
- టీఆర్ఎస్ నుంచి ఒవైసీ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలి
- కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఎవరు ఎక్కువ డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు
- కారుకు పంక్చర్ కాబోతోందనే.. కొండా టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
దేశ ద్రోహులను పెంచడంలో, మీడియా మీద ఆంక్షలు విధించడంలో, నేరాల పెరుగుదలలో, మద్యం అమ్మకాల్లో, అవినీతిలో, అబద్ధాలు చెప్పడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కృష్ణసాగర్ విమర్శించారు. కాంగ్రెస్ ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని... చంద్రబాబు ఇచ్చిన రూ. 500 కోట్లతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కారుకు పంక్చర్ కాబోతోందనే... కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.