Karnataka: నిత్యానంద కోసం గాలిస్తున్న కర్ణాటక పోలీసులు!

  • గంజాయి తీసుకోవాలని శిష్యులకు ప్రేరేపణ
  • సోషల్ మీడియాలో వైరల్
  • కేసు నమోదవడంతో పారిపోయిన ఆధ్యాత్మిక గురువు

తన శిష్యులను గంజాయి తీసుకోవాలని ప్రేరేపిస్తున్నారన్న ఆరోపణలపై విచారించేందుకు రావాలని నోటీసులు ఇచ్చినా స్పందించని వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోసం కర్ణాటక పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన తమిళనాడు పారిపోయినట్టు అనుమానిస్తున్న పోలీసులు, అక్కడికి ఓ టీమ్ ను పంపారు. గంజాయి వినియోగం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగగా, ఆయనపై కేసు నమోదైంది.

More Telugu News