t-bjp: టీ-బీజేపీ మేనిఫెస్టో విడుదల

  • రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం
  • ఇల్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తాం
  • 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాం

టీ-బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఇల్లు లేని పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసి సాగునీరు అందిస్తామని, గోదావరి జలాల సద్వినియోగానికి 9 బ్యారేజీలు నిర్మిస్తామని, మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని పేర్కొన్నారు.

ఇక విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు, కాలేజీ విద్యార్థులకు స్కూటీలిస్తామని, ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు సమకూరుస్తామని హామీలను తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. కాగా, రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఎల్లుండి నుంచి బీజేపీ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి దిగనుంది. కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు, స్టార్ క్యాంపెయినర్లు తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

More Telugu News