tTelugudesam: తెలంగాణ టీడీపీ నాలుగో జాబితా విడుదల..సనత్ నగర్ కి అభ్యర్థి ప్రకటన!

  • సనత్ నగర్ అభ్యర్థిగా కూన వెంకటేశ్ గౌడ్
  • అధికారికంగా ప్రకటించిన టీటీడీపీ
  • 14 స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీడీపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒక అభ్యర్థి పేరును ప్రకటించింది. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పేరును టీటీడీపీ అధికారికంగా ప్రకటించింది. మహాకూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో 9 మంది పేర్లను, రెండో జాబితాలో ఇద్దరి పేర్లను, మూడో జాబితాలో నందమూరి సుహాసిని పేరును ప్రకటించిన టీటీడీపీ... తాజాగా మరొక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. మరొక స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. 

More Telugu News