khammam: అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యం... నామాకే మద్దతు : ఖమ్మం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి సంధ్యారెడ్డి

  • ఆశావహుల్లో ఉన్న అసంతృప్తి రెండు రోజుల్లో సద్దుమణుగుతుంది
  • అంతా కలిసికట్టుగా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తాం
  • టీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడడం మా లక్ష్యం

కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఖమ్మం స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాయంలో ఆ పార్టీ ఖమ్మం ఇన్‌చార్జి సంధ్యారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ నామా నాగేశ్వరరావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనేక సర్వేల అనంతరం ఈ స్థానాన్ని టీడీపీకి అధిష్ఠానం కేటాయించిందని, దీనివల్ల కాంగ్రెస్‌ ఆశావహుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితిని వారు అర్థం చేసుకుని రెండు రోజుల్లో మొత్తం పరిస్థితి సర్దుకుంటుందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో నియంత పాలన కొనసాగుతోందని, ఆ పాలనను అంతమొందించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. పార్టీ నాయకులంతా నామా గెలుపు కోసం ఐక్యంగా కృషి చేస్తామని ప్రకటించారు.

More Telugu News