Hyderabad: హైదరాబాద్ సిటీ టీడీపీ నేతల రహస్య సమావేశం?

  • పొత్తుల పేరుతో టీడీపీని సర్వనాశనం చేశారని ఆవేదన
  • తెలంగాణలో కనీస స్థానాలు కూడా అడగలేదని చర్చ
  • జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ లో నేతల రహస్య భేటీ?

తెలంగాణలో పోటీ చేసే అవకాశం దక్కని టీటీడీపీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీకి చెందిన టీ-టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ లో వీరు సమావేశమైనట్టు సమాచారం. సుమారు 25 మంది నేతలు ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

పొత్తుల పేరుతో టీడీపీని సర్వనాశనం చేశారని ఆ నేతలు ఆవేదన చెందారట. తెలంగాణలో కనీస స్థానాలు కూడా అడగలేదన్న విషయం ఈ సమావేశంలో చర్చకు వచ్చిందట. నేతలు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కారణంగా టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని వారు భావిస్తున్నారు.

More Telugu News