జైలు ఊచలైతే జగన్ కు బాగా కనిపిస్తాయి.. ఇలాంటివి కనిపించవు: అయ్యన్నపాత్రుడు

  • జగన్ అతి పెద్ద దొంగ
  • డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా సీఎం కావాలనుకుంటున్నారు
  • సుజల స్రవంతి ప్రాజెక్టును అడ్డుకుంటే.. సర్వనాశనమైపోతారు
వైసీపీ అధినేత జగన్ అతి పెద్ద దొంగ అంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నది జగనే అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరగడం లేదని జగన్ అంటున్నారని... 300 మీటర్ల లోతున ఉన్న డయాఫ్రం వాల్ ఆయనకు ఎలా కనిపిస్తుందని... జైలు ఊచలైతే ఆయనకు బాగా కనిపిస్తాయని ఎద్దేవా చేశారు.

డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా సీఎం కావాలని కలలు కంటుండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా, జగన్ అడ్డుపడినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సుజల స్రవంతి ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని.. ప్రాజెక్టును అడ్డుకుంటే సర్వనాశనమైపోతారని మండిపడ్డారు.
Go Back to Shorts
jagan
Ayyanna Patrudu
polavaram
sujala sravanthi
YSRCP
Telugudesam

More Telugu News