trupti desai: నాకు ఏమైనా జరిగితే కేరళ సీఎం, డీజీపీలదే బాధ్యత: తృప్తి దేశాయ్

  • 17న శబరిమలకు వెళ్తున్న తృప్తి దేశాయ్
  • భద్రత కల్పించాలని కేరళ సీఎంకు లేఖ
  • ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం

భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఈ నెల 17న శబరిమల ఆలయానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనకు తగినంత భద్రత కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు లేఖ రాశారు. అయితే, కేరళ ప్రభుత్వం నుంచి తనకు ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదని ఆమె తెలిపారు.

17న తాను శబరిమలకు వెళ్తున్నానని... ఈ క్రమంలో తనకు ఏదైనా జరిగితే కేరళ ముఖ్యమంత్రి, డీజీపీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. 17వ తేదీన శబరిమల ఆలయం తిరిగి తెరుచుకుంటోంది. మరోవైపు, 500 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇప్పటికే రిజిష్టర్ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో, ఆలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News