Samanta: రూ. 15 లక్షలు ఖర్చు చేసినా మిగలని పసికందు ప్రాణాలు... సెట్ లో కన్నీరుమున్నీరైన సమంత!

  • 'ప్రత్యూష సపోర్ట్'ను నిర్వహిస్తున్న సమంత
  • సన అనే పాప కాలేయ చికిత్సకు భారీ వ్యయం
  • అయినా దక్కని ప్రాణాలు

'ప్రత్యూష సపోర్ట్' అన్న స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, ప్రాణాపాయంలో ఉన్న చిన్నారులకు తోచినంత సాయం చేస్తూ, వారికి చికిత్సను అందించేందుకు సహకరిస్తున్న సినీ నటి సమంత, కన్నీరు మున్నీరుగా విలపించింది. సనా అనే పసికందు కాలేయం చెడిపోతే, తన మిత్ర బృందంతో కలిసి రూ. 15 లక్షలు సేకరించిన సమంత, ఆ బిడ్డకు చికిత్స చేయించింది. ఆ డబ్బుతో వైద్యులు సనాకు కాలేయాన్ని మార్చారు.

అయితే, చికిత్సకు స్పందించని సనా, మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సమంత సెట్లోనే కన్నీరు మున్నీరైందట. ఈ విషయాన్ని 'ప్రత్యూష సపోర్ట్'లో వాలంటీర్ గా ఉన్న శశాంతా బినేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సనా చనిపోయిన రోజే సమంత పుట్టిన రోజని ఆమె తెలిపారు. కాగా, ఇప్పటివరకూ తాము 547 మంది చిన్నారులను కాపాడామని, సనా చనిపోవడం మాత్రం దురదృష్టకరమని అన్నారు. ఇక ఈ పోస్టుపై సమంత స్పందిస్తూ, శశాంక పోస్టును రీపోస్ట్ చేసింది.

More Telugu News