సముద్రాలను కంట్రోల్ చేశాడు.. రెయిన్ గన్లతో సీమలో కరవును తరిమేశాడు!: సీఎం చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు
- ఏపీలో ఇప్పుడు ఒక్క దోమా కనిపించడం లేదు
- పనిముట్లతో పేదరికాన్ని పారదోలాడు
- చంద్రబాబు పై ఫేస్ బుక్ లో వైసీపీ ఎంపీ విమర్శలు
చంద్రబాబు చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ తర్వాత ఏపీలో ఒక్క దోమ కూడా కనిపించడం లేదని సెటైర్ వేశారు. టెక్నాలజీతో ఏకంగా సముద్రాలను కంట్రోల్ చేసేశారని దెప్పిపొడిచారు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టిన చంద్రబాబు పేపర్లకు ఎక్కారని వెటకారమాడారు.
‘రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపాన్లను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.