TRS: చేసింది చెప్పుకునే స్థాయిలో లేకనే చంద్రబాబును తిడుతున్నారు: టీఆర్ఎస్ పై రావుల ఫైర్

  • బాబుపై మంత్రి హరీశ్ రావు విమర్శలు తగదు
  • చంద్రబాబు లేఖల కారణంగా ఏ ప్రాజెక్టు ఆగింది?
  • కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచే రాష్ట్ర పాలన 

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చెప్పుకునే స్థాయిలో లేదని, అందుకే, ఏపీ సీఎం చంద్రబాబుపై  టీర్ఎస్ నాయకులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారని మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, ఆ లేఖల కారణంగా ఏ ప్రాజెక్టు ఆగిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 ప్రతిపక్షాలను కలుపుకుని పోతామని చెప్పిన కేసీఆర్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను మాత్రమే కలుపుకుపోయారని విమర్శించారు, సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికను రేపు విడుదల చేసే అవకాశముందని చెప్పారు. కాగా, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సింగిల్ డిజిట్ కే టీఆర్ఎస్ పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. 

  • Loading...

More Telugu News