Pawan Kalyan: కొండంత చేయాల్సిన చోట గోరంతా?: చంద్రబాబుపై పవన్ కల్యాణ్ విమర్శలు

  • తిత్లీ తుపాను బాధితులకు ఏ మాత్రం సాయం చేయలేదు
  • ఎవరెస్టంత సాయం బాధితులకు కావాలి
  • వేరుశనగ గింజంత చేసి పబ్లిసిటీయా?
  • ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ విమర్శలు

తెలుగుదేశం ప్రభుత్వం తిత్లీ తుపాను బాధితులకు ఏ మాత్రం సాయం చేయలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ మేరకు నేడు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన ఆయన, కొండంత సాయం చేయాల్సిన చోట గోరంత మాత్రమే చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం బాధితులకు వేరుశనగ గింజంత సాయం చేశారని, ఇక్కడ వాళ్లకు ఎవరెస్ట్ పర్వతమంత సాయం కావాల్సి వుందని అన్నారు. ఈ సందర్భంగా అబ్రహాం లింకన్ చెప్పిన మాటలు తనకు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తిత్లీ బాధితులను ఆదుకుంటోందన్న ప్రచార పోస్టర్ ను ఆతికించుకుని తిరుగుతున్న ఓ ఆర్టీసీ బస్సు ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.




More Telugu News