Manchiryal: మంచిర్యాలలో టీఆర్ఎస్ ఉద్యమకారుల ఆవేదన సభ.. భారీగా హాజరైన కార్యకర్తలు

  • రైతులకు డబ్బివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు
  • మోసకారుల మాటలకు విలువనిస్తున్నారు
  • నియోజకవర్గంలో పర్యటించి భవిష్యత్ నిర్ణయం

మంచిర్యాలలో టీఆర్ఎస్ ఉద్యమకారుల ఆవేదన సభ నిర్వహించడం సంచలనం రేపుతోంది. ఈ సభకు భారీగా కార్యకర్తలు తరలిరావడం విశేషం. టీఆర్ఎస్ నేత, మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి ఆధ్వర్యంలో లక్సెట్టిపేటలో ఈ సభ జరిగింది. ఈ ఉద్యమకారుల ఆవేదన సభలో తిరుపతి మాట్లాడుతూ.. దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లో రైతులకు అందాల్సిన డబ్బులను ఇవ్వకుండా కొందరు నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఉద్యమకారులను పట్టించుకోకుండా మోసకారుల మాటలకు విలువిస్తున్నారంటూ ప్రస్తుత ఎమ్మెల్యేపై తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధిష్టానం జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన కోరారు. తాను త్వరలోనే నియోజకవర్గంలో పర్యటించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని తిరుపతి వెల్లడించారు.

More Telugu News