Kiran Reddy: మద్యం మత్తులో యువజంట హల్‌చల్.. పీఎస్‌లోని వస్తువులను పగులగొట్టిన యువతి

  • మద్యం మత్తులో కారును ఢీకొట్టిన కిరణ్, అనుగుప్తా
  • పోలీస్ స్టేషన్‌లోనూ వీరంగం
  • పీడీయాక్ట్ నమోదు
  • గతంలోనూ కిరణ్‌పై పలు కేసులు

ఫుల్లుగా మద్యం సేవించిన యువతీయువకుడు తమ ముందున్న కారును ఢీకొట్టడమే కాకుండా వారిపైనే దాడికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నండూరి కిరణ్‌రెడ్డి, అనుగుప్తా ఇద్దరూ బాగా మద్యం సేవించి మితిమీరిన వేగంతో వెళ్లి ఓ కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో తిరిగి బాధితులపైనే గొడవకు దిగడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీసులు బ్రీత్ అనలైజర్ ద్వారా ఆల్కహాల్ పరీక్ష చేయగా కిరణ్‌కు 137, అనుగుప్తాకు 122 పాయింట్లు నమోదయ్యాయి. అయితే స్టేషన్‌లో కూడా కిరణ్‌రెడ్డి, అను వీరంగం సృష్టించారు. బాధితులను దూషించడమే కాకుండా స్టేషన్‌లోని వస్తువులను అనుగుప్తా పగులగొట్టింది. దీంతో వీరిపై పీడీయాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కిరణ్‌పై తెలంగాణ వ్యాప్తంగా 13 కేసులున్నాయి. ఏపీలోని కాకినాడలో రౌడీషీట్ ఉంది. అలాగే హైదరాబాద్‌లోని పబ్‌లలో కిరణ్‌పై లై బ్యాన్ ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News