Warangal Rural District: వరంగల్ లో ఈసీ కలకలం.. కాంగ్రెస్ ఆఫీసు తాళాలు పగులగొట్టి తనిఖీలు!

  • పార్టీ నేతలకు సమాచారమివ్వని అధికారులు
  • ఆందోళనకు దిగి, ర్యాలీ నిర్వహించిన నేతలు
  • ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారి సతీశ్ నిర్బంధం

వరంగల్ రూరల్ జిల్లాలో ఈ రోజు కలకలం చెలరేగింది. జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తాళాలను ఈ రోజు ఉదయాన్నే పగులగొట్టిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పార్టీ నేతలకు కనీస సమాచారం ఇచ్చేందుకు ఏమాత్రం యత్నించలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నేతలు ఫ్లయింగ్ స్వ్కాడ్ చీఫ్ సతీశ్ ను నిర్బంధించారు. అలాగే అధికారుల తీరును నిరసిస్తూ నర్సంపేటలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. అధికార పార్టీ కుట్రలో భాగంగానే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రతీకార చర్యలు సరికాదని హెచ్చరించారు. అధికార టీఆర్ఎస్ నేతలే ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News