Andhra Pradesh: చీకట్లు తొలగి వెలుగులు విరజిమ్మాలి: వైఎస్ జగన్

  • కోటి కాంతుల ఆనందాలు నింపాలి
  • ప్రజల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి
  • ట్విట్టర్ లో వైకాపా అధినేత జగన్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ విపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఆయన పెట్టారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తిమీద దైవ శక్తి సాధించే విజయానికి ప్రతీకే ఈ దీపావళి పండుగని ఆయన అభివర్ణించారు. ఈ దీపావళి ప్రతి ఇంటా కోటి కాంతుల ఆనందాలు నింపాలని కోరుకుంటున్నానని, అందరిలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. కాగా, తనపై జరిగిన హత్యాయత్నం తరువాత జగన్, ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వారాంతం నుంచి ఆయన పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News