Telangana: తెలంగాణలో కూడా మహాకూటమిదే విజయం: మంత్రి సోమిరెడ్డి జోస్యం

  • కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారు
  • కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రజలు మద్దతు పలికారు
  • ఈ ఫలితాలు దేశంలో పరిణామాలకు అద్దం పడుతున్నాయి

కర్ణాటకలో బీజేపీకి ప్రజలు షాక్ ఇచ్చారని, కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రజలు మద్దతు పలికారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీకి ఆ రాష్ట్ర ప్రజలు తగినబుద్ధి చెప్పారని అన్నారు. కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. కర్ణాటకలో   సాధారణ ఎన్నికల తర్వాత మోదీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో మహాకూటమికే విజయం లభిస్తుందని జోస్యం చెప్పారు.


 

More Telugu News