ali: ఈవీవీ గారికి కోపం వచ్చింది .. షూటింగు నుంచి వెళ్లిపోయాను: నటి జ్యోతి

  • ఈవీవీగారు మంచి పాత్రలే ఇచ్చారు 
  • 'కితకితలు' విషయంలో అలా జరిగింది 
  • ఈవీవీ గారితో దూరం పెరిగింది

తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలను పోషిస్తూ నటిగా జ్యోతి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "ఈవీవీ గారు గతంలో నాకు మంచి పాత్రలే ఇచ్చారు .. అలాగే 'కితకితలు' సినిమాలో వేషం ఉందని చెబితే మంచి పాత్రే ఇస్తారు గదా అని వెళ్లాను. కానీ అదో వ్యాంప్ తరహా పాత్ర .. లొకేషన్ కి వెళ్లిన తరువాత నాకు ఆ విషయం అర్థమైంది.

అక్కడున్న వాళ్లంతా నేను ఆ పాత్రను ఒప్పుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు .. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నా పాత్రను కాస్త మార్చమని ఈవీవీ గారిని అడిగాను. 'ఏంటి నేను చెబితే చేయవా?' అన్నారు. ఈ విషయంలోనే ఆయన సీరియస్ అయ్యారు. 'నాకు ఇబ్బందిని కలిగించేది నేను చేయను సార్' అంటూ షూటింగ్ స్పాట్ నుంచి ఇంటికి వెళ్లిపోయాను. అప్పటి నుంచి ఈవీవీగారితో దూరం పెరిగింది" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News