geeta singh: ఈవీవీ గారు స్థలం అమ్మేశారని తెలిసి .. సినిమా హిట్ కావాలని కోరుకున్నా: హాస్యనటి గీతా సింగ్

  • తేజ గారు 'జై'లో ఛాన్స్ ఇచ్చారు 
  • ఈవీవీ గారు లేని లోటు కనిపిస్తోంది 
  • దేవుడికి అలా దణ్ణం పెట్టుకున్నాను

హాస్యనటిగా గీతాసింగ్ కి మంచి పేరు వుంది. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను చెప్పుకొచ్చారు. "దర్శకుడు తేజ గారు 'జై' సినిమాతో నాకు ఫస్టు ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత 'ఎవడిగోల వాడిది' సినిమాలో ఈవీవీ గారు అవకాశం ఇచ్చారు. ఈ రెండు సినిమాలు నా కెరియర్ కి ఎంతో హెల్ప్ అయ్యాయి .. అందువలన వాళ్లిద్దరూ నాకు రెండు కళ్లుగా భావిస్తాను.

ఈవీవీ గారు లేని లోటు చాలా కనిపిస్తోంది. 'కితకితలు' సినిమా చేస్తున్నప్పుడు చాలామంది హీరోయిన్స్ వున్నారు గదా ..  'గీతాసింగ్' ను ఎందుకు పెట్టుకుంటున్నారు?' అని ఆయనను కొంతమంది అడిగారు. అయినా ఆ మాటలను పట్టించుకోకుండా ఆయన నాకే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయనకి ఎంతో ఇష్టమైన ఒక స్థలం అమ్మేశారని తెలిసింది. దాంతో 'ఈ సినిమా తప్పకుండా హిట్ అయ్యేలా చూడు స్వామి' అని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఆ సినిమా హిట్ అయినందుకు నేను చాలా సంతోషించాను" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News