Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు 9న గాజుల అలంకరణ

  • భక్తుల నుంచి గాజులు సేకరించనున్న అధికారులు
  • ఇందుకోసం ఆలయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు
  • దుర్గామల్లేశ్వర ఆలయం సన్నిధిలో సోమవారం మహాలక్ష్మి యాగం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మకు ఈనెల 9వ తేదీన గాజుల అలంకరణ నిర్వహించనున్నారు. ఈ అలంకరణ కోసం భక్తుల నుంచి గాజులు సేకరించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం ఆవరణలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు.

భక్తులు సమర్పించిన గాజులతో అమ్మవారిని ఆ రోజున అలంకరించనున్నారు. కాగా, ఆలయం ఆవరణలో ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. యాగంలో ఉభయ దాతలు మొత్తం 75 మంది పాల్గొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా నిర్వహించిన యాగంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News