Manchu Manoj: రాజకీయ ప్రవేశంపై మంచు మనోజ్ ఇంకాస్త క్లారిటీ!

  • గత నెలలో ఫ్యాన్స్ కు లేఖ
  • నీ గోల్ ఏంటని ప్రశ్నించిన అభిమాని
  • ఖాళీ ప్రదేశాన్ని చూపుతూ ట్వీట్

తనకు రాజకీయాల్లోకి రావాలని వుందని, తిరుపతి కేంద్రంగా ప్రజా సేవను ప్రారంభించి, రాయలసీమ ప్రాంతమంతటికీ విస్తరిస్తానని గత నెలలో అభిమానులకు లేఖ రాసిన మంచు మనోజ్, తన రాజకీయ అరంగేట్రంపై ఇంకాస్త స్పష్టత ఇచ్చాడు.

ఓ అభిమాని ట్విట్టర్ వేదిక ద్వారా మనోజ్ ను ప్రశ్నిస్తూ, "అసలు నీ ప్లాన్ ఏంటి, నీ స్కీం ఏంటి, నీ గోల్ ఏంటి?" అని అడుగగా స్పందించాడు. ఓ ఖాళీగా ఉన్న ప్రదేశంలో దిగిన ఫొటోను జత చేసిన మనోజ్, "పేద విద్యార్ధులు, రైతుల కోసం ఏదో చేయాల‌నుకున్న నా క‌ల ఈ ఖాళీ ప్ర‌దేశం ద్వారా తీర‌బోతుంది" అన్నాడు. తన కల ఇక్కడి నుంచే తీరబోతోందని, తానున్న చోట, ఉచిత ఆహారం, క్రీడా సౌకర్యాలు, మంచినీటి వసతి ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.

More Telugu News