Chandrababu: సిగ్గులేకుండా చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు: ‘కాంగ్రెస్’ నేతలపై కేటీఆర్

  • జానా, ఉత్తమ్ లు తెలంగాణలోనే పులులు
  • చంద్రబాబు ముందు వీళ్లిద్దరూ పిల్లులు
  • చంద్రబాబు ‘ఉస్కో’ అంటే, వీళ్లు ‘డిస్కో’ అంటున్నారు

'కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు తెలంగాణలోనే పులులు.. చంద్రబాబు ముందు పిల్లులు' అంటూ టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు చంద్రబాబు ‘ఉస్కో’ అంటే, వీళ్లు ‘డిస్కో’ అంటున్నారని, చంద్రబాబు ముందు వీళ్లు చేతులు కట్టుకుని సిగ్గులేకుండా నిలబడ్డారని ఓ రేంజ్ లో విమర్శించారు.

‘మా రాహుల్ గాంధీకి సిఫారసు చేసి మాకు టికెట్టు ఇప్పించండని ఈ ఇజ్జెత్తు తక్కువ నాయకులు అక్కడికి పోయి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఒక్క విషయం వాళ్లు మర్చిపోతున్నారు. రాహుల్ గాంధీ సీట్లివ్వొచ్చు.. చంద్రబాబు నోట్లివ్వొచ్చు కానీ, ఓట్లేసేది మాత్రం తెలంగాణ ప్రజలు. వాళ్లకు అన్ని విషయాలు తెలుసు. తప్పకుండా కర్రు కాల్చి వాతపెట్టేది ఖాయం’ అంటూ చెప్పిన కేటీఆర్... ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News