allu shirish: ముగింపు దశలో అల్లు శిరీశ్ మూవీ

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • డిసెంబర్ 15తో షూటింగ్ పూర్తి 
  • ఫిబ్రవరి 8వ తేదీన విడుదల

ఆ మధ్య మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన 'ఏబీసీడీ' అనే సినిమా అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అల్లు శిరీశ్ హీరోగా ఆ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

ఈ సినిమాలో శిరీశ్ స్నేహితుడిగా భరత్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అమెరికాలో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేశారట. డిసెంబర్ 15వ తేదీ నాటికి ఈ సినిమా షూటింగును పూర్తిచేయనున్నామనీ, ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న శిరీశ్ కి, ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News