Andhra Pradesh: కర్నూలు సైకో టీచర్ వ్యవహారంపై మంత్రి గంటా ఆగ్రహం.. ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు!

  • ప్రేమించాలని టీచర్ శంకర్ వేధింపులు
  • ఒప్పుకోకపోవడంతో ఈరోజు హత్యకు యత్నం
  • ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువతి

తనను ప్రేమించలేదన్న అక్కసుతో కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై టీచర్ శంకర్ కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రాణాలు దక్కించుకోగా, శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. బాలికపై దాడికి పాల్పడిన హిందీ పండిట్ శంకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. కర్నూలు పట్టణంలోని బంగారుపేట కాలనీలో ఉంటున్న బాధితురాలిపై ఈ రోజు ఉదయం శంకర్ కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. యువతిపై దాడి అనంతరం తానూ ఆత్మహత్య ప్రయత్నం చేయబోగా శంకర్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

More Telugu News