vigilence week: ‘అవినీతి రహిత భారత్‌‘ నినాదంతో విజయవాడలో మినీ మారథాన్‌

  • విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా 5కే రన్‌
  • బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ నుంచి విజయ టాకీస్‌ వరకు
  • పాల్గొన్న ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌

‘అవినీతి రహిత భారత్‌‘ నినాదంతో విజయవాడలో నేడు మినీ మారథాన్‌ నిర్వహించారు. నగరంలోని బకింగ్‌హాంపేట పోస్టాఫీస్‌ నుంచి విజయ టాకీస్‌ వరకు ఐదు కిలోమీటర్ల మేర ఈ రన్‌ సాగింది. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా నిర్వహించిన ఈ ‘రన్‌ ఫర్‌ కరప్షన్‌ ఫ్రీ ఇండియా’ మారథాన్‌లో ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన లంచగొండి నేరాల పట్ల ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎలీసా, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీస్‌ అభిజిత్‌ దిలీప్‌రావు, తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

More Telugu News