Chandrababu: జాతీయపార్టీలెన్ని కలిసినా బీజేపీని ఏం చేయలేవు: విష్ణుకుమార్‌రాజు

  • అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట
  • ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వరు
  • టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ కు తీవ్ర నష్టం
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంశమై స్పందించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు చేయడంలో దిట్ట అని విమర్శించారు.

జాతీయ స్థాయిలో ఎన్ని పార్టీలు కలిసినా బీజేపీని ఎవరూ ఏం చేయలేరన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎంత తప్పు చేశారో చంద్రబాబుకు డిసెంబర్ 11న తెలుస్తుందన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వరని.. టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుంటే తెలంగాణలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఎద్దేవా చేశారు.
Chandrababu
Vishnu kumar Raju
BJP
Telugudesam
Telangana
Congress

More Telugu News