5 odi: ఐదో వన్డే.. భారత్ విజయ లక్ష్యం 105 పరుగులు

  • తక్కువ పరుగులకే ఆలౌటైన విండీస్ జట్టు
  • 31.5 ఓవర్లలో 104 పరుగులు చేసిన వెస్టిండీస్
  • సిరీస్ దక్కించుకునేందుకు భారత్ ఉత్సాహం

కేరళలోని తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్ జట్టు 104 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు విజృంభించడంతో 31.5 ఓవర్లకే విండీస్ జట్టు ఆలౌట్ అయింది. కాగా, భారత్ కు కేవలం105 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని విండీస్ జట్టు నిర్దేశించింది. సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ జట్టు ఉత్సాహంగా ఉంది.

విండీస్ బ్యాటింగ్: 

కేవోఏ పావెల్ (0), ఆర్. పావెల్ (16), హోప్ (0), సామ్యూల్స్ (24), హెట్ మయర్ (9), హోల్డర్ (25), అలెన్ (4), పాల్ (5), రోచ్ (5), థామస్ (0), బిషూ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

భారత్ బౌలింగ్ :  

భువనేశ్వర్ కుమార్ -1, బుమ్రా -2, కేకే అహ్మద్ -2, జడేజా - 4, కులదీప్ యాదవ్ -1

More Telugu News