Keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అంతర్జాతీయ చిత్రోత్సవానికి 'మహానటి'
  •  మహేశ్ బాబు సాఫ్ట్ వేర్ కంపెనీ!
  • 'స్పైడర్' నిర్మాత చేతికి రజనీ చిత్రం
  • హారర్ థ్రిల్లర్ చేస్తున్న సుమంత్ అశ్విన్  

*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'మహానటి' చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జరిగే 49వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది.
*  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇందులో హీరో మహేశ్ బాబు అమెరికాలో వున్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి యజమానిగా కనిపిస్తాడట.
*  రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న '2.ఓ' (రోబో సీక్వెల్) చిత్రం తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ భారీ రేటును ఆఫర్ చేసి, దక్కించుకున్నారు. గతంలో ఆయన మహేశ్ బాబుతో 'స్పైడర్' చిత్రాన్ని నిర్మించారు.  
*  సుమంత్ అశ్విన్ హీరోగా ఓ హారర్ థ్రిల్లర్ రానుంది. 'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగును ఈ నెల రెండో వారం నుంచి నిర్వహిస్తారు.

More Telugu News