Telangana: కుదిరిన అవగాహన.. టీడీపీకి 14 సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకారం

  • నేడు రాహుల్ గాంధీని కలవనున్న చంద్రబాబు
  • టీడీపీ పోటీ చేసే స్థానాలపై నేడు స్పష్టత
  • టీజేఎస్‌కు 8 స్థానాలు ఇవ్వాలని నిర్ణయం

తెలంగాణ శాసనసభకు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్-టీడీపీలు ఓ అవగాహనకు వచ్చాయి. టీడీపీకి 14 సీట్లు ఇచ్చేందుకు ఏఐసీసీ అంగీకరించింది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నేడు కలుసుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయమై చర్చిస్తారు. ఏయే నిజయోజకవర్గాల్లో టీడీపీ బరిలోకి దిగాలనుకుంటోందో రాహుల్‌కు వివరిస్తారు. మరోవైపు, టీజేఎస్‌కు 8 స్థానాలు ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న టీజేఎస్ అధినేత కోదండరాం.. రాహుల్ గాంధీతో చర్చించనున్నారు.

More Telugu News