Raviteja: రవితేజతో 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్

  • 'ఆర్ ఎక్స్ 100'తో మంచి గుర్తింపు 
  • యూత్ లో ఒక్కసారిగా పెరిగిన క్రేజ్ 
  • వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఛాన్స్    

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పాయల్ రాజ్ పుత్ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రేజ్ కారణంగానే ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా ఆమె రవితేజ సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆ తరువాత సినిమాను ఆయన దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి చేయనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరమట. ఒక కథానాయికగా నాభా నటేశ్ ను తీసుకున్నారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. ఇక రవితేజ మూవీలో మరో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.    

More Telugu News