Jagan: జగన్ గాయంపై విశాఖ వైద్యులు చెప్పిన దానిని ధ్రువీకరించిన హైదరాబాద్ వైద్యులు

  •  గాయంలో ఎలాంటి విషపదార్థాలు లేవన్న సిటీ న్యూరో సెంటర్
  • గాయం మానేందుకు మరో ఆరు వారాలు
  • జగన్‌ను పరీక్షించిన డాక్టర్ శివారెడ్డి బృందం

విశాఖపట్టణం విమానాశ్రయంలో వైసీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనలో అయిన గాయం చిన్నదేనని హైదరాబాద్ వైద్యులు స్పష్టం చేశారు. విశాఖపట్టణం వైద్యులు చెప్పిన విషయాన్నే ధ్రువీకరించిన సిటీ న్యూరో సెంటర్ రాతపూర్వకంగా ఈ విషయాన్ని పేర్కొంది. గాయం తీవ్రమైనది (గ్రీవియస్) కాదని పేర్కొంది. ఈ మేరకు డాక్టర్ డీఎస్ శివారెడ్డి పేర్కొన్నారు. అలాగే, గాయంలో ఎలాంటి విషపదార్థాలు లేవని పేర్కొన్నారు.

జగన్ నివాసమైన లోటస్‌పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం డాక్టర్ శివారెడ్డి బృందం పరీక్షించింది. ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్భంగా డాక్టర్ శివారెడ్డి మాట్లాడుతూ.. గాయం చిన్నదేనని, అయితే, పూర్తిగా తగ్గేందుకు మరో ఆరు వారాల సమయం పడుతుందని పేర్కొన్నారు. కొన్ని జాగ్రత్తలతో జగన్ పాదయాత్రలో పాల్గొనవచ్చని తెలిపారు.

More Telugu News