akhil: నిర్మాత నుంచి 'మిస్టర్ మజ్ను' అప్డేట్

  • 'మిస్టర్ మజ్ను'గా అఖిల్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • రెండు పాటలు .. ఫైట్లు బ్యాలెన్స్    

'తొలిప్రేమ'తో తొలి హిట్ ను అందుకున్న వెంకీ అట్లూరి, ఆ తరువాత సినిమాను అఖిల్ హీరోగా చేస్తున్నాడు. 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడారు. "కథా పరంగా ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని 'లండన్' లో చిత్రీకరించాం. రెండు పాటలు .. రెండు ఫైట్లు మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ సంతృప్తిని కలిగించింది. మిగిలిన రెండు పాటలను .. ఫైట్లను త్వరలోనే పూర్తిచేయనున్నాం. ఆ తరువాత విడుదల తేదీని ప్రకటిస్తాము. తమన్ సంగీతం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది" అని చెప్పుకొచ్చారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. 

More Telugu News