manikonda: మణికొండ కరూర్ వైశ్యాబ్యాంక్ లో చోరీకీ యత్నం.. బొమ్మ తుపాకీతో బెదిరించిన వైనం

  • బ్యాంక్ కస్టమర్ గా లోపలికి ప్రవేశించిన నిందితుడు
  • అప్రమత్తమైన సిబ్బంది, ఖాతాదారులు, స్థానికులు
  • నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగింత

హైదరాబాద్ లోని మణికొండ కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ లో ఓ దుండగుడు పట్టపగలే చోరీకి యత్నించాడు. బ్యాంక్ కస్టమర్ గా ఈరోజు మధ్యాహ్నం లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత, తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే వెంటనే, అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్థానికులు నిందితుడిని పట్టుకుని, రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News