varun tej: నిజామ్ కాలంనాటి ప్రేమకథతో మెగా హీరో

  • కొత్త కథలకి వరుణ్ ప్రాధాన్యత 
  • త్వరలో 'అంతరిక్షం' విడుదల 
  • తదుపరి ప్రాజెక్టుకి సన్నాహాలు  

మొదటి నుంచి కూడా వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఒక సినిమాకి .. మరో సినిమాకి ఎలాంటి పోలిక లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'కంచె' .. 'తొలిప్రేమ' .. 'ఫిదా' చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'అంతరిక్షం' కూడా పూర్తి వైవిధ్యభరితమైన చిత్రమే. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో విభిన్నమైన కథావస్తువుకి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇటీవలే దర్శకుడు సాగర్ చంద్ర .. వరుణ్ కి ఒక కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. 'కంచె' మాదిరిగానే ఈ కథ కూడా చారిత్రక నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. నిజామ్ కాలం నాటి ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. 'అంతరిక్షం' విడుదలైన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.      

More Telugu News