ys jagan: ఈ జగన్నాటకం గురించి వాళ్లిద్దరూ ముందుగానే ప్లాన్ వేశారు: బుద్ధా వెంకన్న ఆరోపణలు

  • ఏపీలో జగన్నాటకం జరుగుతోంది
  • దీనికి ప్రధాని మోదీయే డైరెక్టర్
  • జీవీఎల్, విజయసాయిరెడ్డి కలిసి ముందుగానే ఈ దాడికి పథకం పన్నారు

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జగన్నాటకం జరుగుతోందని, దీనికి ప్రధాని మోదీయే డైరెక్టర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ జగన్నాటకం గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరగడం, ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.

విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ముందుగానే ఈ దాడికి ప్లాన్ వేశారని, ఈ ప్లాన్ లో జగన్, శ్రీనివాస్ (నిందితుడు)లు నటులని విమర్శించారు. నీచమైన రాజకీయాలకు తెరలేపారని, ఈ సంఘటనతో జగన్ మోహన్ రెడ్డి బండారం బట్టబయలైందని, ఇక ప్రధాని మోదీ బండారం బట్టబయలు కావాల్సి ఉందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మోదీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.

More Telugu News