Andhra Pradesh: జగన్ పై దాడికి నెల రోజుల క్రితమే కత్తి కొనుగోలు.. స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన శ్రీనివాసరావు!

  • ఇప్పుడెందుకు కొంటున్నావని ప్రశ్నించిన యజమాని
  • పనిఉందిలే అంటూ దాటవేసిన శ్రీనివాసరావు
  • స్తోమతకు మించి మిత్రులకు విందుల ఏర్పాటు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు పక్కా ప్రణాళికతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితం నిందితుడు కోడి పందేలకు వాడే కత్తిని ఓ తయారీదారు నుంచి కొనుగోలు చేసినట్లు స్థానికుడొకరు చెబుతున్నారు. ఈ సందర్భంగా తయారీదారుడు ‘ఇప్పుడు కోడి పందేలు ఏమీ లేవు. పైగా నువ్వు కోడి పందేలు ఆడవు. ఈ కత్తి నీకెందుకు?’ అని ప్రశ్నించాడని చెబుతున్నారు. దీనికి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ‘నాకు ప్రత్యేకంగా పని ఉందిలే’ అంటూ తీసుకెళ్లాడని వెల్లడించారు.

అంతేకాకుండా కొన్నిరోజుల క్రితం శ్రీనివాసరావు సోదరుడు కుమార్తె పుట్టిన రోజును ఆ కుటుంబం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తన స్నేహితులకు భారీగా పార్టీ ఇచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్థికంగా అంత బలంగా లేకపోయినా శ్రీనివాసరావు భారీగా ఖర్చు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పై దాడిలో కుట్ర కోణం దాగుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News